Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 శాతం వేతనం డిమాండ్ చేస్తే 22.5 శాతం పెంచారు : కార్మిక శాఖ కమిషన్

ఠాగూర్
శుక్రవారం, 22 ఆగస్టు 2025 (11:42 IST)
గత 18 రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను స్తంభింపజేసిన కార్మికుల సమ్మెకు తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిష్టంభన వీడింది. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో, శుక్రవారం నుంచి సినిమా షూటింగులు తిరిగి ప్రారంభం కానున్నాయి.
 
వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో టాలీవుడ్‌లో చిత్రీకరణలన్నీ నిలిచిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన మేరకు ఫిల్మ్ ఛాంబర్, ఎఫ్‌డీసీ, కార్మిక శాఖ రంగంలోకి దిగాయి. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ఇరు పక్షాలు ఒకరి సమస్యలను ఒకరు అర్థం చేసుకున్నాయని, సమస్య పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
 
ఈ ఒప్పందం వివరాలను కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ వెల్లడించారు. కార్మికులు 30 శాతం వేతన పెంపు డిమాండ్ చేయగా, సుదీర్ఘ చర్చల తర్వాత 22.5 శాతం పెంపునకు ఇరువర్గాలు అంగీకరించాయని ఆయన వివరించారు. ఈ పెంపు మూడేళ్లలో దశలవారీగా అమలు కానుంది. రూ.2 వేల లోపు వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం చొప్పున పెంపు ఉంటుంది. అదేవిధంగా, రూ.2 వేల నుంచి రూ.5 వేల మధ్య వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం చొప్పున వేతనాలు పెరగనున్నాయి.
 
ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని, శుక్రవారం నుంచి కార్మికులందరూ విధులకు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు. పరిశ్రమ అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని, ముఖ్యమంత్రికి వారు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. తాజా ఒప్పందంతో తెలుగు చిత్రపరిశ్రమలో మళ్లీ సినిమా షూటింగులు ప్రారంభంకానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

పవన్ కళ్యాణ్ "ఓజీ" నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ ఎపుడో తెలుసా?

మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు : విమర్శకులకు జాన్వీ కౌంటర్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments