హైదరాబాద్ లోక్ సభ భాజపా అభ్యర్థి మాధవీలత ఎండలను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గం మొత్తం చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేయాలనీ, తద్వారా దేశంలో మరోసారి మోదీ ప్రభుత్వాన్ని తీసుకురావాలంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ బస్తీలోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. అక్కడ ఓ మహిళతో తనకు ఓటు వేయాలని అడిగారు.
ఐతే ఆ మహిళ కరపత్రం తీసుకున్న తర్వాత మాధవీలతను నెట్టివేస్తూ కనిపించింది. ఐతే వారి మధ్య జరిగిన సంభాషణ ఏమిటో తెలియలేదు కానీ మాధవీలతను మహిళ నెట్టివేసిన వీడియో మాత్రం వైరల్ అయ్యింది. ఆ దృశ్యాన్ని చిత్రీకరించినవారిపై మాధవీలత ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు కూడా కనబడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.