ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

ఠాగూర్
సోమవారం, 23 డిశెంబరు 2024 (19:23 IST)
'పుష్ప-2' చిత్రం ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటరులో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన ఇపుడు పెనువివాదానికి దారితీసింది. ఈ తొక్కిసలాట ఘటనకు హీరో అల్లు అర్జున్ కారణమంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయగా ఈ వ్యాఖ్యలను హీరో అల్లు అర్జున్ ఖండించారు. 
 
ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. ఐకాన్ స్టార్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉంటదా? అని ప్రశ్నించారు. ఐకాన్ స్టార్ అయితే ఎవరిని చంపినా ఫర్వలేదా? అని సూటిగా అడిగారు. ప్రధానమంత్రి అయినా సర్పంచ్ అయినా ఐకాన్ స్టార్ అయినా అందరికీ ఒకటే చట్టం అని అన్నారు. 
 
చిత్రపరిశ్రమకు చెందిన హీరోల్లో అనేక మంది స్మార్ట్‌గా తయారైన అల్లు అర్జున్‌ను పరామర్శించారు కానీ ఆసుపత్రికి మాత్రం రాలేదన్నారు. జింకను చంపిన కేసులో ఇంటర్నేషనల్ స్టార్ సల్మాన్ ఖానే 14 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగారని గుర్తు చేశారు. విలేకరుల సమావేశం పెట్టి తనను, సీఎంను అలా అనడం కరెక్ట్ కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments