Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల డబ్బులు చెల్లించేందుకు పోటీపడుతున్న వాహనదారులు...

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (08:32 IST)
తెలంగా రాష్ట్రంలో వాహనదారులు తమ పెండింగ్ చలాన్లకు అపరాధం చెల్లించేందుకు పోటీపడుతున్నారు. దీనికి కారణం ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ విభాగం భారీగా రాయితీ ప్రకటించడమే. దీంతో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు విశేష ఆదరణ లబిస్తుంది. గురువారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రూ.8.50 కోట్ల మేరకు ఫైన్ వసూలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 9.61 లక్షల చలాన్ల చెల్లింపులతో రూ.8.44 కోట్ల ఆదాయం లభించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా రాజధాని హైదరాబాద్ నగర పరిధిలోనే చెల్లించినట్టు వెల్లడించారు. 
 
హైదరాబాద్ నగర పరిధిలో 3.54 లక్షల చలాన్ల ద్వారా రూ.2.62 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షల చలాన్ల ద్వారా రూ.1.80 కోట్లు, రాచకొండ పరిధిలో 93 వేల చలాన్ల ద్వారా రూ.76.79 లక్షలు చొప్పున ఆదాయం వచ్చినట్టు పేర్కొంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున చెల్లింపులు జరుగుతుండటంతో ఒక్కో సమయంలో సర్వర్ రూడా డౌన్ అవుతుంది. 
 
పెండింగ్ చలాన్లపై రాయితీపై ప్రకటిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీచేసింది. టూ వీలర్స్, త్రీ వీలర్స్ వాహనాలపై 80 శాతం, నాలుగు చక్రాలైన కార్లు, భారీ వాహనాలపై 60 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం చొప్పున రాయితీని ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
మూవింగ్ కారు పైభాగంలో చిన్నారుల నిద్ర... వీడియో వైరల్... 
 
గోవా రాష్ట్రంలో ఇద్దరు చిన్నారులు ప్రమాదకరరీతిలో కారులో ప్రయాణించారు. వేగంగా వెళుతున్న కారు పైభాగంలో వారు నిద్రిస్తున్నారు. ఈ దృశ్యం గోవా రాష్ట్రంలోని మాపుసా పట్ణణ సమీపంలో కనిపించింది. వీరిద్దరూ ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ కనిపించారు. పర్రా గ్రామంలో బుధవారం ఆ వాహనం వెళుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 
 
ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. కారుపై చిన్నారులు పడుకుని ఉండటంతో వీడియో తీస్తున్న వ్యక్తి కారు డ్రైవర్‌ను ప్రశ్నించగా, అతను సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి మాపుసా పట్టణ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కారు నంబరు ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ కారు తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగివుండటం గమనార్హం. 
 
మాకొద్దీ ఈ సంబరాల రాంబాబు... అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ... 
 
ఏపీ జలవనరుల శాఖామంత్రి, వైకాపా సీనియర్ నేత అంబటి రాంబాబుకు అసమ్మతి సెగ తగిలింది. మాకొద్దీ సంబరాలు రాంబాబు అంటూ వైకాపా నేతలు తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూకట్టారు. నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు దాదాపు వంద మంది వరకు గురువారం ఉదయం తాడేపల్లికి వెళ్లి అధిష్టానానికి తమ నిరసన గళం వినిపించారు. ఎంపీ, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. 
 
అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వొద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. సంబరాల రాంబాబుకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని, మరొకరికి ఇస్తే మాత్రం విజయం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇలా తమ నిరసన గళాన్ని వినిపించిన వారిలో విజయకుమారి కోటిరెడ్డి, అలేఖ్య కృపాకరరావు, సయ్యద్ సీమారఫి, రమేష్ రెడ్డి, రోశిరెడ్డి, మహేంద్ర, భూలక్ష్మి విజయకుమార్, అనిల్ కుమార్, వెంకట కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. 
 
ఆ తర్వాత వారంతా సంయుక్తంగా విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ ఆవిర్భావం నుంచి పని చేసిన వారిని రాంబాబు పక్కకు నెట్టేశారు. పార్టీని సర్వనాశనం చేశారు. బ్రోకర్లను పెట్టుకుని దోచుకుంటున్నారు. గ్రామాల్లో పార్టీ రెడు గ్రూపులుగా మారిపోయేందుకు అంబటి రాంబాబు కారకులయ్యారు. సంబరాల రాంబాబు మాకొద్దు.. అంబటి రాంబాబు అస్సలు వద్దనే వద్దు అంటూ నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments