సికింద్రాబాద్ - నాగ్‌పూర్‌ల మధ్య వందే భారత్ రైలు.. ప్రారంభం ఎపుడంటే..

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (08:36 IST)
తెలంగాణ రాష్ట్రానికి మరో వందే భారత్ రైలును కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్ - నాగ్‌పూర్ ప్రాంతాల మధ్య నడుపనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. తాజాగా ఐదో సెమీ హైస్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీన ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ఈ రైలు సేవలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చా జెండా ఊపుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఈ వందే భారత్ రైలు రెండు నగారల మధ్య 578 కిలోమిటర్ల దూరాన్ని 7 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. రైల్వే శాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ రైలు నాగ్‌పూర్‌లో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్న 12.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒక్క గంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట్, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments