Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ - నాగ్‌పూర్‌ల మధ్య వందే భారత్ రైలు.. ప్రారంభం ఎపుడంటే..

ఠాగూర్
మంగళవారం, 10 సెప్టెంబరు 2024 (08:36 IST)
తెలంగాణ రాష్ట్రానికి మరో వందే భారత్ రైలును కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్ - నాగ్‌పూర్ ప్రాంతాల మధ్య నడుపనున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇప్పటికే పలు వందే భారత్ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. తాజాగా ఐదో సెమీ హైస్పీడ్ ట్రైన్ పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ నెల 15వ తేదీన ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో ఈ రైలు సేవలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పచ్చా జెండా ఊపుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
ఈ వందే భారత్ రైలు రెండు నగారల మధ్య 578 కిలోమిటర్ల దూరాన్ని 7 గంటల 15 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. రైల్వే శాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ రైలు నాగ్‌పూర్‌లో ఉదయం 5 గంటలకు బయలుదేరి మధ్యాహ్న 12.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం ఒక్క గంటకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు కాజీపేట్, రామగుండం, బల్లార్షా, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్‌లలో మాత్రమే ఆగుతుందని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

మలయాళ సినిమా జింఖానా ట్రైలర్‌ కు అనిల్ రావిపూడి ప్రమోషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments