Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాధవీలత గట్టిపోటీ ఇచ్చినా మజ్లిస్‌కే గెలుపు.. ఏపీలో ఆ ముగ్గురు?

సెల్వి
శనివారం, 1 జూన్ 2024 (22:23 IST)
తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు గాను మజ్లిస్ పార్టీ హైదరాబాద్‌లో మాత్రమే పోటీ చేసిందని గ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైందని ఆరా మస్తాన్ సర్వే గుర్తు చేసింది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మాధవీలత గట్టి పోటీ ఇచ్చారని... అయినప్పటికీ మజ్లిస్ ఈ స్థానాన్ని గెలుచుకోనుందని తెలిపింది. 
 
హైదరాబాద్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కొంపెల్ల మాధవీలత ఓడిపోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైందని ఆరా మస్తాన్ సర్వే తేల్చింది. 
 
అలాగే ఆరా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించారు. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయిన జనసేనాని పవన్ కల్యాణ్ ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో నెగ్గి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని అంచనా వేశారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు భారీ మెజారిటీతో నెగ్గడం ఖాయమని, అదే విధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నుంచి విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో ఎంట్రీ ఇవ్వనున్నారని 'ఆరా' మస్తాన్ వివరించారు. 
 
ఇక, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతాడని అంచనా వేశారు. బాలయ్యకు మంచి మెజారిటీ వస్తుందని అన్నారు. అయితే... ఓవరాల్ అంచనాల ప్రకారం ఏపీలో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments