Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2వేల వరద సాయాన్ని కేంద్రం వెంటనే ప్రకటించాలి.. రేవంత్ రెడ్డి

సెల్వి
సోమవారం, 2 సెప్టెంబరు 2024 (22:33 IST)
Revanth Reddy
తెలంగాణ రాష్ట్రానికి వరద సాయంగా రూ.2000 కోట్లు తక్షణ సాయంగా అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం కేంద్రాన్ని అభ్యర్థించారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చిన ఆయన, తక్షణం సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. నిధులు వచ్చేలా కేంద్రమంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌లు కృషి చేయాలని కోరారు. 
 
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన ఆయన ముందుగా సూర్యాపేట జిల్లాలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలను పరిశీలించారు.  
 
సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని, పంట, ఇతర నష్టాలపై అధికారులు తనకు ప్రాథమిక నివేదిక ఇచ్చారని తెలిపారు. 
 
ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి వివరించి, వారి మద్దతు కోరినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఎకరం భూమిలో పంటనష్టం వాటిల్లితే రూ.10వేలు పరిహారం చెల్లిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments