Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

ఠాగూర్
బుధవారం, 22 మే 2024 (06:27 IST)
తెలంగాణా రాష్ట్రంలో సీసీఎస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు పోగు చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మంగళవారం ఆయనకు సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఉమామహేశ్వర రావు అవినీతికి సంబంధించి కీలక పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. 
 
ఆ తర్వాత ఏసీపీ ఉమామహేశ్వర రావును ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనను అరెస్ట్ చేశామని ఏసీబీ జేడీ సధీంద్రబాబు వెల్లడించారు. బుధవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి జైలుకు తరలిస్తామని తెలిపారు. 
 
కాగా, ఈ తనిఖీల్లో 17 ప్రాంతాల్లో ఉమామహేశ్వర రావుకు ఆస్తులు ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపారు. వీటిలో ఘట్‌కేసర్‌లో ఐదు ఫ్లాట్స్, శామీర్ పేటలో విల్లా గుర్తించామని చెప్పారు. ఏసీపీ ఉమామహేశ్వర రావుకు చెందిన రెండు లాకర్లు గుర్తించామని వెల్లడించారు. రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్ చేశామని చెప్పారు. ఇప్పటివరకు మార్కెటి విలువ ప్రకారం రూ.3 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

తర్వాతి కథనం
Show comments