Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్సీ ఎన్నికలు : కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (09:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు  జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ అధిష్టానం సీటును కేటాయించింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు. ఈ క్రమలో పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఆయన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానంలో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
గత యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితా కూడా వెలువరించారు. ఈ ఎన్నికలకు మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments