ఎమ్మెల్సీ ఎన్నికలు : కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న

వరుణ్
గురువారం, 25 ఏప్రియల్ 2024 (09:50 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు  జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ అధిష్టానం సీటును కేటాయించింది. గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చారు. ఈ క్రమలో పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఆయన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానంలో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
గత యేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ స్థానం నుంచి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితా కూడా వెలువరించారు. ఈ ఎన్నికలకు మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments