Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : కవితకు బెయిల్ వస్తుందా? రాదా?

ఠాగూర్
మంగళవారం, 20 ఆగస్టు 2024 (10:29 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కె.కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరుపనుంది. దీంతో ఆమెకు బెయిల్ వస్తుందా? రాదా? అన్నది ఇపుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ స్కామ్‌లో అరెస్టయిన కవిత.. గత మార్చి 26వ తేదీ నుంచి తీహార్ జైలులో ఉంటున్న విషయం తెల్సిందే. 
 
ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ ఆమె తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 
 
లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 16వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ నగరంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఆమెను నేరుగా ఢిల్లీకి తరలించి మార్చి 16వ తేదీన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆమెకు కోర్టు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఫలితంగా మార్చి 16వ తేదీ నుంచి ఆమె తీహార్ జైలులో ఉంటున్నారు. తీహార్ జైలులో ఉండగానే ఎంటరైన సీబీఐ కవితను అరెస్టు చేసింది. ఈ క్రమంలో ఇటీవల ఆమె స్వల్ప అస్వస్థతకు లోనైన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య!!

శ్రియా శరణ్ తన 42వ పుట్టినరోజు... అయినా చేతిలో సినిమాలు

'దేవర' ట్రైలర్ హీరో ఎన్టీఆర్‌ను నిరుత్సాహపరిచిందా?

నా సమ్మతం లేకుండానే విడాకులు ప్రకటన చేశారు.. ఆర్తి రవి

"ఆర్ఆర్ఆర్" తర్వాత సోలో మూవీ.. కాస్త భయంగా ఉంది : జూనియర్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chicken Pepper Fry.. ఎలా చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటి?

డెంగ్యూ వచ్చిందని గ్లాసెడు బొప్పాయి రసం ఒకేసారి తాగుతున్నారా?

ఈ లక్షణాలు కనబడితే కిడ్నీలు చెడిపోతున్నాయని అనుకోవచ్చు

మొలకెత్తిన రాగులను తింటే మధుమేహం పరార్

డెంగ్యూ జ్వరంతో రక్తంలో పడిపోయిన ప్లేట్‌లెట్లు పెంచుకునే మార్గం ఇదే

తర్వాతి కథనం
Show comments