Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (14:55 IST)
హైదరాబాద్ నగరంలోని కంచి గచ్చిబౌలిలో అభయారణ్యంలోని చెట్లను ముందస్తు అనుమతులు లేకుండా నరికినట్టు తేలితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులందరినీ జైలుకు పంపిస్తామని సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు గచ్చిబౌలి భూముల వివాదంపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయి సారథ్యంలోని ధర్మాసనం పై విధంగా స్పందించింది. 
 
కంచి గచ్చిబౌలి అభయారణ్యంలోని చెట్లను కొట్టేసే ముందు 1996లో సుప్రీంకోర్టు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారా లేదా అన్నది స్పష్టం చేయాలని ధర్మాసనం వ్యాఖ్యానించారు. రూ.10 వేల కోట్లకు మార్టిగేజ్ చేశారని సీఈసీ నివేదికలో పొందుపరిచిన వివరాలను అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకురాగా, చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా అనేది తమకు ముఖ్యమని, ఆ భూముల మార్టిగేజ్ విషయం తమకు అనవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు ఆలకించిన ధర్మాసనం.. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments