Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఐవీఆర్
సోమవారం, 18 ఆగస్టు 2025 (16:46 IST)
వీధి కుక్కల కాటుకి ఎంతోమంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు వాటి కాటుకి బలై ప్రాణాల కోసం పోరాడుతున్నారు. తాజాగా తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగిలోని ఖాన్ కాలనీ మార్కెట్ యార్డులో వీధి కుక్కలు స్త్వైర విహారం చేసాయి. ఒకేసారి 9 మందిపై దాడి చేసి పాదాలను, పిక్కలను పీకాయి. దాంతో వారంతా రక్తమోడుతో బాధతో కేకలు వేస్తూ విలవిలలాడారు.
 
యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ కోసం పరిగి ఆసుపత్రికి పరుగులు తీసారు. ఐతే అక్కడ ఆ మందు లభించకపోవడంతో అంతా కలిసి తాండూరు ఆసుపత్రికి వెళ్లారు. ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా కుక్కలు తండోపతండాలుగా పెరిగిపోయాయనీ, రాత్రివేళ లేదా మధ్యాహ్నం వేళ ఒంటరిగా వెళితే ఒక్కసారిగా కుక్కల దండు తమపై దాడి చేస్తున్నాయని వారు వాపోతున్నారు.
 
ఐతే వన్యప్రాణుల సంరక్షణ కోసం పోరాడేవారు మాత్రం ఒక్క వీధి కుక్కకి కూడా హాని చేయడాన్ని అంగీకరించబోమని నిరశనలు చేస్తున్నారు. కుక్క కాటుకి గురవుతున్న ప్రజలు మాత్రం.. మీరు అలా నిరశనలు చేసే బదులు వీధి కుక్కలన్నిటికీ మీ ఇళ్లకు తీసుకుని వెళ్లి వాటికి ఆశ్రయాలను ఏర్పాటు చేసి తిండి పెట్టండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వీధి కుక్కల సమస్య ఎలా పరిష్కారం అవుతుందో చూడాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments