ఇంటి టెర్రస్‌పై దూసుకెళ్లిన బుల్లెట్.. మహిళకు గాయం

సెల్వి
బుధవారం, 31 జులై 2024 (10:04 IST)
హైదరాబాద్‌లోని నార్సింగి ప్రాంతంలో మంగళవారం తన ఇంటి టెర్రస్‌పై బుల్లెట్ దూసుకెళ్లడంతో ఒక మహిళ గాయపడినట్లు అధికారులు తెలిపారు. సైనికులు ప్రాక్టీస్ చేస్తున్న సమీపంలోని ఆర్మీ ఫైరింగ్ రేంజ్ నుంచి అది మిస్ ఫైర్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పద్మ అనే మహిళ గంధంగూడలోని తన భవనం టెర్రస్‌పై ఉండగా, ఆమె కాలికి బుల్లెట్ తగిలి చీలమండ దగ్గర బుల్లెట్ గాయమైంది.
 
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నార్సింగిలో ఈ నెలలో ఇది రెండో ఘటన. జూన్ 13న, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని ఐదవ అంతస్తులో ఉన్న ఫ్లాట్‌లోని అద్దాల కిటికీల నుంచి బుల్లెట్ దూసుకుపోయింది. 
 
ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. గంధంగూడ సమీపంలో రెండు ఫైరింగ్ రేంజ్‌లు ఉన్నాయి, ఇక్కడ పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments