Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం: బాంబు పేల్చిన దానం నాగేందర్

ఐవీఆర్
శుక్రవారం, 12 జులై 2024 (15:09 IST)
త్వరలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతోందని దానం నాగేందర్ బాంబు పేల్చారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం వెనుక కారణాలు లేకపోలేదని ఆయన చెప్పుకొచ్చారు. అక్కడ ఎమ్మెల్యేలకు ఎంతమాత్రం గౌరవం వుండదనీ, కలిసేందుకు అపాయిట్మెంట్ కూడా ఇవ్వరని ఆరోపించారు. అలాంటి బాధలను భరించలేకే ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నారని అన్నారు. భారాసలో మిగిలేది కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అని వెల్లడించారు.
 
2023 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోవడం, ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో బీఆర్‌ఎస్ ఇప్పటికే తెలంగాణలో కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. గ్రేటర్ హైదరాబాద్ రీజియన్‌కు చెందిన ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
 
శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో అధికారికంగా కాంగ్రెస్‌లో చేరనున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తొలి అడుగు వేశారు. రాజకీయ మార్పు ఇప్పటికే ఖరారైంది. బీఆర్ఎస్ కష్టాలకు తోడు, జూలై 13న మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ శిబిరంలో చేరనున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మా రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ రేపు కాంగ్రెస్‌లోకి మారనున్నట్లు సమాచారం. మొత్తమ్మీద రాబోయే ఐదారు నెలలు లోపుగానే భారాసను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments