Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ఠాగూర్
ఆదివారం, 23 ఫిబ్రవరి 2025 (13:47 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఈ రిస్క్యూ ఆపరేషన్‌‍లో భాగంగా, టన్నెల్లోకి ఎన్డీఆర్‌ఎఫ్ బృందం వెళ్లింది. ఆ తర్వాత నాలుగు గంటల తర్వాత తిరిగి వచ్చేసింది. టన్నెల్‌ లోపలికి 12 కిలోమీర్ల మేర ట్రైన్‌లో ప్రయాణించి అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల మేరకు నడుచుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ వెళ్లింది. మోకాలు లోతు నీరు ఉండి ఉండటంతో టన్నెల్‌లో ముందుకు వెళ్లలేకపోయింది. 
 
కాగా, ప్రమాదం జరిగిన చోట ఆరు మీటర్ల మేర బురద పేరుకునివున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఫ్లై కెమెరాతో ప్రమాదం జరిగిన దృశ్యాలను చిత్రీకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాగే, అధునాతన సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్లాలని ఎన్డీఆర్ఎఫ్ బృందం చెబుతుంది. అలాగే, ప్రస్తుతం టెన్నెల్ నుంచి వెనక్కి తిరిగివచ్చిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉన్నతాధికారుల ఆదేశాలతో మరోమారు లోపలికి వెళ్లే అవకాశం ఉంది. 
 
మరోవైపు, టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం సర్వశక్తులా పోరాడుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరిగి హైదరాబాద్ నగరానికి వచ్చి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వాస్తవ పరిస్థితిని వివరించారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments