Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్, బుల్లెట్ మోటార్‌కి మంటలు, ఆర్పుతుండగా పేలుడు, ఆరుగురికి తీవ్ర గాయాలు - live video

ఐవీఆర్
ఆదివారం, 12 మే 2024 (21:54 IST)
హైదరాబాదులో ఆదివారం సాయంత్రం మొఘల్‌పురా వద్ద ఘోర ఘటన చోటుచేసుకున్నది. మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉండగా బుల్లెట్ మోటార్‌సైకిల్‌లోని ఇంధన ట్యాంక్ పేలడంతో ఒక పోలీసు సహా ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జంట మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా మైమర్ చికెన్ సెంటర్ బీబీ బజార్ రోడ్డు సమీపంలో వాహనం నుంచి మంటలు చెలరేగాయి.
 
దంపతులు ద్విచక్రవాహనం నుంచి కిందకు దిగారు. స్థానికులు గుమిగూడి సమీపంలోని దుకాణం నుంచి తెచ్చిన నీటిని ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. నీళ్లు, గోనె సంచులను ఉపయోగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుండగా, ట్యాంక్ అకస్మాత్తుగా పేలడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మోటార్ సైకిల్ పేలుడు ఘటనలో పార్క్ చేసిన మరో రెండు మోటార్‌సైకిళ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ మంటల కారణంగా దుకాణం కూడా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments