Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాకింగ్, బుల్లెట్ మోటార్‌కి మంటలు, ఆర్పుతుండగా పేలుడు, ఆరుగురికి తీవ్ర గాయాలు - live video

ఐవీఆర్
ఆదివారం, 12 మే 2024 (21:54 IST)
హైదరాబాదులో ఆదివారం సాయంత్రం మొఘల్‌పురా వద్ద ఘోర ఘటన చోటుచేసుకున్నది. మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉండగా బుల్లెట్ మోటార్‌సైకిల్‌లోని ఇంధన ట్యాంక్ పేలడంతో ఒక పోలీసు సహా ఆరుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ జంట మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా మైమర్ చికెన్ సెంటర్ బీబీ బజార్ రోడ్డు సమీపంలో వాహనం నుంచి మంటలు చెలరేగాయి.
 
దంపతులు ద్విచక్రవాహనం నుంచి కిందకు దిగారు. స్థానికులు గుమిగూడి సమీపంలోని దుకాణం నుంచి తెచ్చిన నీటిని ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. నీళ్లు, గోనె సంచులను ఉపయోగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తుండగా, ట్యాంక్ అకస్మాత్తుగా పేలడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మోటార్ సైకిల్ పేలుడు ఘటనలో పార్క్ చేసిన మరో రెండు మోటార్‌సైకిళ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ మంటల కారణంగా దుకాణం కూడా ధ్వంసమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments