Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మంలో 1612 కిలోల గంజాయి అగ్నికి ఆహుతి

సెల్వి
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (17:01 IST)
ఖమ్మం జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శుక్రవారం రూ.4 కోట్ల విలువైన 1612 కిలోల గంజాయిని దగ్ధం చేసింది. ఖమ్మం జిల్లాలోని నాలుగు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్లలో స్మగ్లర్లపై సదరు శాఖ చేపట్టిన తనిఖీల్లో అక్రమాస్తులు స్వాధీనం చేసుకున్నారు. 
 
డిపార్ట్‌మెంట్ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్, వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత ఎక్సైజ్ అధికారులు బ్యాగుల్లో నింపిన నిషిద్ధ వస్తువులను జిల్లాలోని ఐఎన్‌టీసీ కాంప్లెక్స్‌కు తీసుకొచ్చి దహనం చేశారు.
 
కాగా చాలా కాలంగా వివిధ కేసుల్లో పట్టుబడిన పెద్ద మొత్తంలో గంజాయిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నేతృత్వంలో సోమవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేయడం తొలిసారి కావడం గమనార్హం.
 
ఈ గంజాయి మండుతున్నప్పుడు వెలువడే వాయువులు కూడా మానవాళికి హానికరమే కావడంతో నగర శివారు మంచుకొండ ప్రాంతానికి తీసుకెళ్లి పంచనామా అనంతరం తగులబెట్టారు. ఖమ్మం వన్ టౌన్, ఖమ్మం టూ టౌన్, ఖమ్మం త్రీ టౌన్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వేంసూరు, కల్లూరు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 7 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను అరెస్టు చేసినట్లు అడిషనల్ డిసీపీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

విశ్వం నుంచి గోపీచంద్, కావ్యథాపర్ ల రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది

మిస్టర్ ఇడియ‌ట్‌ సినిమాలోని కాంతార కాంతార.. సాంగ్ రిలీజ్ చేసిన నిఖిల్

సూపర్‌ ఏజెంట్స్ గా ఆలియాభట్‌, శార్వరి నటిస్తున్న ఆల్ఫా చిత్రం క్రిస్మస్‌ కు సిద్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments