Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహిత ఆత్మహత్య కేసు.. అత్త, ఆడపడుచుకు జీవితఖైదు

ఠాగూర్
మంగళవారం, 13 ఆగస్టు 2024 (12:32 IST)
వరకట్నం వేధింపులను భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసును విచారించిన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి సెషన్స్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహితను ఆత్మహత్య చేసుకునేనా వేధించిన అత్త, ఆడపడుచుకి జీవిత కారాగారశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. తాజాగా వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం పూల్సంగీతండాకు చెందిన పత్తావత్ సురేందర్‌కు సునీతతో వివాహమైంది. వరకట్నంగా సునీత తల్లిదండ్రులు రూ.5 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. సురేందర్ - సునీత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
వివాహమైన రెండేళ్ల నుంచి సునీతను భర్త సురేందర్, అత్త పీక్లీ, అడపడుచు సంతోష అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టారు. ఈ వేధింపులు తాళలేక 2021 జనవరి 10వ తేదీన సునీత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
 
తాజాగా ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితులను దోషులుగా తేల్చి, ముగ్గురికీ యావజ్జీవ జైలుశిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కాగా, ఈ కేసులో కేవలం మూడేళ్లలోనే తుది తీర్పు వెలువడటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments