Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహిత ఆత్మహత్య కేసు.. అత్త, ఆడపడుచుకు జీవితఖైదు

ఠాగూర్
మంగళవారం, 13 ఆగస్టు 2024 (12:32 IST)
వరకట్నం వేధింపులను భరించలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసును విచారించిన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి సెషన్స్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. వివాహితను ఆత్మహత్య చేసుకునేనా వేధించిన అత్త, ఆడపడుచుకి జీవిత కారాగారశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. తాజాగా వెల్లడైన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, 
 
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం పూల్సంగీతండాకు చెందిన పత్తావత్ సురేందర్‌కు సునీతతో వివాహమైంది. వరకట్నంగా సునీత తల్లిదండ్రులు రూ.5 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. సురేందర్ - సునీత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
 
వివాహమైన రెండేళ్ల నుంచి సునీతను భర్త సురేందర్, అత్త పీక్లీ, అడపడుచు సంతోష అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించడం మొదలు పెట్టారు. ఈ వేధింపులు తాళలేక 2021 జనవరి 10వ తేదీన సునీత ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
 
తాజాగా ఈ కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నిందితులను దోషులుగా తేల్చి, ముగ్గురికీ యావజ్జీవ జైలుశిక్షతో పాటు రూ.50వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. కాగా, ఈ కేసులో కేవలం మూడేళ్లలోనే తుది తీర్పు వెలువడటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments