Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (18:37 IST)
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ బాలుడు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వుందనే, వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. 
 
గత రెండు వారాలుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులు మెడికల్ బులిటెన్‌ను విడుదల చేశారు. అలాగే, ప్రభుత్వం తరపున నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాలు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆస్పత్రికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ మెదడుకు డ్యామేజ్ జరిగిందని వైద్యులు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆ బాలుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. మెదడు దెబ్బతిన్న కారణంగా చికిత్స చాలాకాలం కొనసాగాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని వివరించారు. చిత్ర హీరో అల్లు అర్జున్ రావడంతో ఈ తొక్కిసలాట జరిగిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments