Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీతేజ్‌ మెదడుకు డ్యామేజీ జరిగిందంటున్న వైద్యులు.. (Video)

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (18:37 IST)
హైదరాబాద్ నగరంలోని సంధ్య థియేటర్‌లో 'పుష్ప-2' మూవీ ప్రీమియర్ షో ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ బాలుడు ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే వుందనే, వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతున్నట్టు సమాచారం. 
 
గత రెండు వారాలుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులు మెడికల్ బులిటెన్‌ను విడుదల చేశారు. అలాగే, ప్రభుత్వం తరపున నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాలు శ్రీతేజ్ చికిత్స పొందుతున్న కిమ్స్ ఆస్పత్రికి వచ్చి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 
 
ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ మెదడుకు డ్యామేజ్ జరిగిందని వైద్యులు విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆ బాలుడు కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. మెదడు దెబ్బతిన్న కారణంగా చికిత్స చాలాకాలం కొనసాగాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని వివరించారు. చిత్ర హీరో అల్లు అర్జున్ రావడంతో ఈ తొక్కిసలాట జరిగిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

తర్వాతి కథనం
Show comments