Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలానికి వెళ్లి పురుగుల మందు తాగిన రైతు... రైతు ప్రాణాలు కాపాడిన పోలీస్... ఎలా?

వరుణ్
గురువారం, 29 ఫిబ్రవరి 2024 (13:26 IST)
ఇంట్లో గొడవపడి పొలానికి వెళ్లి పురుగుల మందు తాగిన ఓ రైతు ప్రాణాలను పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రక్షించాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతును తన భుజాలపై వేసుకుని రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామానికి తీసుకెళ్లి, అక్కడ నుంచి సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి, ప్రాణాలు రక్షించాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, భేతిగల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని వీణవంక మండలం భేతిగల్‌కు చెందిన రైతు సురేశ్ బుధవారం ఇంట్లో గొడవపడి కోపంతో పొలానికి వెల్లాడు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
అప్పటికే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన సురేశ్‌ను జయపాల్ తన భుజాన వేసుకుని పొలం గట్లపై దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో పరుగెత్తుకుంటూ వెళ్లి గ్రామంలోని ఆస్పత్రిలో చేర్చాడు. అక్కడ నుంచి వాహనంపై జమ్మిగుంట ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రైతును తన భుజాలపై మోస్తూ సకాలంలో ఆస్పత్రికి తీసుకొచ్చిన కానిస్టేబుల్ జయపాల్‌ను గ్రామస్థులతో పాటు వైద్యులు, సహచర పోలీసులు కూడా అభినందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments