Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (22:28 IST)
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ రావు తాజాగా మరో కేసులో అరెస్టయ్యాడు. ఓ చీటింగ్ కేసుకు సంబంధించి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు మంగళవారం అతనిని అదుపులోకి తీసుకున్నారు. 
 
గతంలో అఖండ ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థకు శ్రవణ్ రావు 6.58 కోట్ల రూపాయలు మేర నష్టం కలిగించారని, మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులను సీపీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు, విచారణ నిమిత్తం హాజరుకావాల్సిందిగా శ్రవణ్ రావుకు నోటీసులు జారీచేశారు. 
 
దీంతో మంగళవారం నాడు శ్రవణ్ రావు సీసీఎస్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. సుధీర్ఘ విచారణ అనంతరం, ఆయనను అరెస్టు చేసినట్టు పోలీస్ వర్గాలు ప్రకటించాయి. శ్రవణ్ రావును నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచేందుకు పోలీసులు తరలించారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రవణ్ రావు, ఇపుడు చీటింగ్ కేసులో అరెస్టు కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments