వీధికుక్కల దాడి.. శంషాబాద్‌లో బాలుడు అక్కడికక్కడే మృతి

సెల్వి
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (10:47 IST)
శంషాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఏడాది వయసున్న బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన కోళ్ల సూర్యకుమార్, యాదమ్మ దంపతులు శంషాబాద్‌కు వలస వచ్చారు. 
 
రాళ్లగూడ సమీపంలో ఓ గుడిసెలో ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు కాగా.. అందులో ఒకరు అనారోగ్యంతో, మరొకరు పుట్టిన వారం రోజులకే చనిపోయారు.
 
ప్రస్తుతం నిండు గర్భిణి అయిన యాదమ్మ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా.. కొడుకు నాగరాజుతో కలిసి సూర్యకుమార్ గుడిసెలో ఉంటున్నాడు. అయితే, తెల్లవారుజామున మరోసారి నిద్రలేచిన నాగరాజు.. అమ్మ కనిపించకపోవడంతో ఏడుస్తూ గుడిసె బయటకు వచ్చాడు. 
 
దీంతో వీధికుక్కలు నాగరాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి వాటిని తరిమేశారు. అయితే, అప్పటికే నాగరాజు చనిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments