Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీధికుక్కల దాడి.. శంషాబాద్‌లో బాలుడు అక్కడికక్కడే మృతి

సెల్వి
శుక్రవారం, 2 ఫిబ్రవరి 2024 (10:47 IST)
శంషాబాద్‌లో వీధికుక్కల దాడిలో ఏడాది వయసున్న బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం నాగారం గ్రామానికి చెందిన కోళ్ల సూర్యకుమార్, యాదమ్మ దంపతులు శంషాబాద్‌కు వలస వచ్చారు. 
 
రాళ్లగూడ సమీపంలో ఓ గుడిసెలో ఉంటూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు కాగా.. అందులో ఒకరు అనారోగ్యంతో, మరొకరు పుట్టిన వారం రోజులకే చనిపోయారు.
 
ప్రస్తుతం నిండు గర్భిణి అయిన యాదమ్మ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరగా.. కొడుకు నాగరాజుతో కలిసి సూర్యకుమార్ గుడిసెలో ఉంటున్నాడు. అయితే, తెల్లవారుజామున మరోసారి నిద్రలేచిన నాగరాజు.. అమ్మ కనిపించకపోవడంతో ఏడుస్తూ గుడిసె బయటకు వచ్చాడు. 
 
దీంతో వీధికుక్కలు నాగరాజుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి వాటిని తరిమేశారు. అయితే, అప్పటికే నాగరాజు చనిపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెన్నెల కిషోర్ డిటెక్టివ్ గా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments