Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యో.. మేం వేసిన ఓట్ల వల్ల కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందా? ప్రజలు మెసేజ్

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (19:59 IST)
ప్రభుత్వం పోవాలంటూ ఒకసారి ఓట్లు వేసాక.. అయ్యో మేం వేసిన ఓట్లు వల్ల కేసీఆర్ ప్రభుత్వం పోయిందా అని ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన జనం సందేశాలు పంపుతున్నారట. ఈ మాట తెలంగాణ మాజీమంత్రి కేటీఆర్ చెప్పారు. ఈరోజు అంబేద్కర్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
 
ప్రతి ఎన్నికలోనూ అనుకున్న ఫలితాలు రావనీ, ఒక్కోసారి మనం అనుకోనివి ఎదురవుతుంటాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినవారు తాము వేసిన ఓట్ల వల్ల కేసీఆర్ ప్రభుత్వం పోయిందా అంటూ తమకు సందేశాలను పంపుతున్నారని చెప్పారు. ఓటమి పాలైనంత మాత్రాన బాధపడేది ఏమీలేదనీ, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం తాము ప్రజల పక్షాన నిలబడి మాట్లాడతామని చెప్పారు.
 
పార్టీ పరాజయం పాలైందని ఆవేదన చెందనక్కర్లేదని, తప్పకుండా మన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని ధైర్యం చెప్పారు. మరోవైపు కేసీఆర్ బస చేసి వున్న ఫామ్ హౌసుకి చింతమడక ప్రజలు పెద్దఎత్తున వెళ్లి ఆయనను సందర్శించి జైకొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments