మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

ఠాగూర్
మంగళవారం, 8 జులై 2025 (11:13 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ముద్దాయికి 20 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ హైదరాబాద్ నగరంలోని పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అలాగే, బాధితురాలికి భారీగా పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే,
 
గత 2016లో హైదరాబాద్ పాతబస్తీకి చెందిన అఖిల్ అనే యువకుడు ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బాలిక గర్భవతి కావడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
 
ఈ కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ పక్షాన వాదనలు బలంగా వినిపించారు. బాధితురాలి వాంగ్మూలం, కీలకమైన వైద్య నివేదికలు, ఇతర సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం, అఖిల్‌ను దోషిగా నిర్ధారిస్తూ అతనికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. అంతేకాకుండా, బాధితురాలికి ప్రభుత్వం తరపున రూ.8 లక్షల పరిహారం అందించాలని తీర్పులో స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం