Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

ఠాగూర్
మంగళవారం, 21 మే 2024 (08:37 IST)
తెలంగాణా రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ ఓ శుభవార్త చెప్పింది. జూన్ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీల మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేసిస్తాయని పేర్కొంది. ఈ దఫా నైరుతి గమనం సానుకూలంగానే ఉందని వాతావరణ శఖ ఇప్పటికే ప్రకటించింది. తొలుత కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే ఈ రుతుపవనాలు... అక్కడ నుంచి ఏపీలోని రాయలసీమ మీదుగా తెలంగాణ చేరుకోవడానికి ఐదారు రోజుల సమయం పడుతుంది. 
 
రుతుపవనాల రాకతో జాప్యం జరిగితే జూన్ రెండో వారంలో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత యేడాది జూన్ 11వ తేదీన కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించగా, తెలంగాణ రాష్ట్రంలోకి మాత్రం 20వ నాటికి విస్తరించాయి. ఈ దఫా మాత్రం పది రోజులు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. 
 
ఇక మహాసముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులన్నీ సానుకూలంగా ఉండటంతో ఈ యేడాది నైరుతి రుతుపవనాలతో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవాకాశం ఉందని, నైరుతి రుతుపవనాల గమనం ఆశాజనకంగా ఉందని, జూన్ 11వ తేదీతో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
రోదసీలోకి వెళ్లిన తొలి తెలుగు టూరిస్ట్ - ఎవరీ గోపీచంద్ తోటకూర 
 
రోదసీలోకి తొలి పర్యాటకు వెళ్లారు. అతని పేరు గోపీచంద్ తోటకూకర. తెలుగు వ్యక్తి. ఇపుడు ఈ పేరు అంతర్జాతీయంగా మార్మోగిపోతుంది. రోదసిలోకి వెళ్లి వచ్చిన తొలి భారతీయ పర్యాటకుడిగా తన పేరును లిఖించుకున్నాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజన్ సంస్థ ఆదివారం న్యూ షెపర్డ్-25 పేరుతో ఆదివారం ఉదయం నిర్వహించిన అంతరిక్షయాత్రలో గోపి పాలుపంచుకున్నాడు.
 
టెక్సాస్‌లోని ప్రయోగ కేంద్రం నుంచి ఉదయం 10.37 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక ధ్వనివేగానికి మూడింతల వేగంతో ప్రయాణించి భూ వాతావరణం, అంతరిక్ష సరిహద్దుగా భావించే కర్మన్ రేఖ ఎగువకు అంటే 105.7 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. ఆ వెంటనే పర్యాటకులు కాసేపు భార రహత స్థితిని అనుభవించారు. అక్కడి నుంచి భూమిని తనివితీరా వీక్షించారు. పది నిమిషాల్లోనే యాత్రను ముగించుకున్న నౌక ఆపై సురక్షితంగా భూమిని చేరింది. బ్లూ ఆరిజన్ నిర్వహించిన ఏడో మానవసహిత యాత్ర ఇది. తాము నివసించే భూమిని అంతరిక్షం నుంచి తనివితీరా వీక్షించారు. 
 
అయితే, రోదసీలోకి వెళ్ళిన తొలి తెలుగు పర్యాటకుడిగా గుర్తింపు పొందిన ఈ గోపీచంద్ తోటకూర సొంతూరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ వాసి. ఎంబ్రీ రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తిచేశారు. అమెరికాలో స్థిరపడ్డారు. పైలట్‌గా, ఏవియేటర్‌గా పనిచేస్తున్నారు. విమానాలతోపాటు సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లను కూడా ఆయన నడిపిస్తారు. అట్లాంటలో ప్రిజర్వ్ లైఫ్ కార్ప్ అనే వెల్నెస్ సంస్థను స్థాపించారు.
 
1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ రోదసీలోకి వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఓ భారతీయుడు, అందులోనూ ఓ తెలుగువాడు అంతరిక్షంలోకి వెళ్లి ఆ ఘనత సాధించిన రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించారు. తాజా యాత్రలో మొత్తం ఆరుగురు పాల్గొనగా వారిలో 90 ఏళ్ల వయనున్న నల్లజాతి వ్యోమగామి ఎడెడ్వెట్ కూడా ఉండడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments