శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. కుటుంబం బలి

సెల్వి
గురువారం, 17 అక్టోబరు 2024 (12:38 IST)
శుభకార్యానికి వెళ్లి ఆ కుటుంబం తిరుగు ప్రయాణం చేస్తుండగా యముడు ఆ కుటుంబాన్ని బలితీసుకున్నాడు. సంతోషంగా శుభకార్యానికి ముగించుకుని వస్తుండగా.. ఒకే కుటుంబానికి చెందిన వారంతా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 
 
అతివేగమే కుటుంబాన్ని బలి తీసుకుందని పోలీసులు తెలిపారు. వేగంగా వెళ్లిన ఓ కారు ఓ గుంతలో పడి ఎగిరి చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రత్నాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారంతా ఒక కుటుంబానికి చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. 
 
ఒక శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై మృతి చెందిన తండ్రి శివరాం(56), తల్లి దుర్గి (50), పెద్ద కూతురు శాంతి (38), మూడో కూతురు అనిత (35), శాంతి కూతురు మమత (16), అనిత కూతుర్లు హిందు (12), శ్రావణి(10)లుగా గుర్తించారు. 
 
కారు నడిపిన పెద్దల్లుడు నాం సింగ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతను హీరో నాగ చైతన్య మోసం చేశారా?

పవన్ ఎలాంటివారో ప్రపంచానికి చెప్పేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా: బండ్ల గణేశ్

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

తర్వాతి కథనం
Show comments