Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. కుటుంబం బలి

సెల్వి
గురువారం, 17 అక్టోబరు 2024 (12:38 IST)
శుభకార్యానికి వెళ్లి ఆ కుటుంబం తిరుగు ప్రయాణం చేస్తుండగా యముడు ఆ కుటుంబాన్ని బలితీసుకున్నాడు. సంతోషంగా శుభకార్యానికి ముగించుకుని వస్తుండగా.. ఒకే కుటుంబానికి చెందిన వారంతా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 
 
అతివేగమే కుటుంబాన్ని బలి తీసుకుందని పోలీసులు తెలిపారు. వేగంగా వెళ్లిన ఓ కారు ఓ గుంతలో పడి ఎగిరి చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రత్నాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారంతా ఒక కుటుంబానికి చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. 
 
ఒక శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై మృతి చెందిన తండ్రి శివరాం(56), తల్లి దుర్గి (50), పెద్ద కూతురు శాంతి (38), మూడో కూతురు అనిత (35), శాంతి కూతురు మమత (16), అనిత కూతుర్లు హిందు (12), శ్రావణి(10)లుగా గుర్తించారు. 
 
కారు నడిపిన పెద్దల్లుడు నాం సింగ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments