శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. కుటుంబం బలి

సెల్వి
గురువారం, 17 అక్టోబరు 2024 (12:38 IST)
శుభకార్యానికి వెళ్లి ఆ కుటుంబం తిరుగు ప్రయాణం చేస్తుండగా యముడు ఆ కుటుంబాన్ని బలితీసుకున్నాడు. సంతోషంగా శుభకార్యానికి ముగించుకుని వస్తుండగా.. ఒకే కుటుంబానికి చెందిన వారంతా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 
 
అతివేగమే కుటుంబాన్ని బలి తీసుకుందని పోలీసులు తెలిపారు. వేగంగా వెళ్లిన ఓ కారు ఓ గుంతలో పడి ఎగిరి చెట్టును ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోగా అందులో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా రత్నాపూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారంతా ఒక కుటుంబానికి చెందిన వారిగా గుర్తించామని తెలిపారు. 
 
ఒక శుభకార్యానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై మృతి చెందిన తండ్రి శివరాం(56), తల్లి దుర్గి (50), పెద్ద కూతురు శాంతి (38), మూడో కూతురు అనిత (35), శాంతి కూతురు మమత (16), అనిత కూతుర్లు హిందు (12), శ్రావణి(10)లుగా గుర్తించారు. 
 
కారు నడిపిన పెద్దల్లుడు నాం సింగ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: మార్చి నెల ఉస్తాద్ గబ్బర్ సింగ్‌కు కలిసి వచ్చేలా వుంది

Sathya: నాగ చైతన్య చిత్రం వృషకర్మ లో సత్య లుక్‌

Srinath: మెన్షన్ హౌస్ మల్లేష్ నిజాయితీగా తీసిన సినిమా: శ్రీనాథ్ మాగంటి

Anantha Sriram: యూత్ కి ఒక యాంథమ్ లాగా ఉండాలనే రై రై రారా. పాట రాశాం : అనంత శ్రీరామ్

Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్‌ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

మాన్యవర్ మోహే మేడ్ ఫర్ ఈచ్ అదర్‌తో రష్మిక మందన, విజయ్ దేవరకొండ

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

తర్వాతి కథనం
Show comments