Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ బాధాకరం : బీజేపీ ఎంపీ రఘునందన్

ఠాగూర్
మంగళవారం, 1 అక్టోబరు 2024 (17:05 IST)
తెలంగాణ మంత్రి కొండా సురేఖను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేయడం ఎంతో బాధాకరమని బీజేపీకి చెందిన మెదక్ ఎఁపీ రఘునందన్ రావు అన్నారు. ఇలాంటి పాడుపనికి పాల్పడింది భారత రాష్ట్ర సమితి కార్యకర్తలేనని పేర్కొన్నారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ, భారస నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్‌ చేశారని విమర్శించారు.
 
'కేవలం ఒక ట్వీట్‌ పెట్టడం కాదు.. ట్రోలింగ్‌పై హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలి. అధికారిక కార్యక్రమంలో మంత్రిని సన్మానిస్తే.. దారుణంగా పోస్టులు పెడతారా? కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా వేదికపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ, భారాస ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, స్థానిక ఎంపీగా నేను ఉన్నాను. 
 
వేలాది మంది సమక్షంలో జరిగిన కార్యక్రమాన్ని బూతద్దంలో చూపించి.. విమర్శలు చేసే వారిని చూస్తే బాధనిపిస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావు దీనిపై స్పందించి సోషల్ మీడియాను కంట్రోల్ చేసుకుని క్షమాపణ చెప్పాలి. ట్రోలింగ్‌ చేసిన వారి వివరాలు సేకరించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా. అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా. అక్కకు మద్దతుగా ఒక న్యాయవాదిగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా' అని రఘునందన్‌రావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments