Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో విద్యా సంస్థలు - ప్రభుత్వ ఆఫీసులకు సెలవు.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 27 డిశెంబరు 2024 (08:43 IST)
దేశ మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి వృద్దాప్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 92 యేళ్లు. ఆయన మృతి సంతాప సూచకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు సెలవు ప్రకటించింది. దీంతో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీచేశారు. అలాగే, శుక్రవారం నుంచి వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా వారం రోజులు  సంతాప దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత ఢిల్లీలో కేంద్ర మంత్రి మండలి భేటీకానుంది. కాగా, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛలనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments