Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎన్నికల ప్రచారం : నేడు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన

ఠాగూర్
శుక్రవారం, 10 మే 2024 (12:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు పర్యటించనున్నారు. ఒక రోజు పాటు ఆయన సుడిగాలి పర్యటన చేయనున్నారు. పాలమూరు ఎన్నికల సభలో ఆయన పాల్గొంటున్నారు. సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటించనున్నారు. 
 
మహారాష్ట్రలోని సందర్భాల్లో ఉదయం 11.30 గంటలకు ఓ బహిరంగ సభకు హాజరై అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు పాలమూరులో ఎన్నికల సభకు హజరవుతారు. అక్కడ నుంచి తిరిగి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. అనంతరం ఆయన ఒడిశాకు వెళ్తారు. భువనేశ్వర్‌లో రాత్రి 8.30 గంటలకు రోడ్‌షో నిర్వహించనున్నారు. 
 
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుని హోటల్‌ తాజ్‌కృష్ణలో విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం భువనగిరిలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడనుంచి బయల్దేరి ఏపీలోని విజయవాడలో 6.45 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు హాజరువుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments