తెలంగాణ ఎన్నికల ప్రచారం : నేడు రాష్ట్రంలో సుడిగాలి పర్యటన

ఠాగూర్
శుక్రవారం, 10 మే 2024 (12:03 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు పర్యటించనున్నారు. ఒక రోజు పాటు ఆయన సుడిగాలి పర్యటన చేయనున్నారు. పాలమూరు ఎన్నికల సభలో ఆయన పాల్గొంటున్నారు. సాయంత్రానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో ప్రచారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటించనున్నారు. 
 
మహారాష్ట్రలోని సందర్భాల్లో ఉదయం 11.30 గంటలకు ఓ బహిరంగ సభకు హాజరై అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ నగరానికి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు పాలమూరులో ఎన్నికల సభకు హజరవుతారు. అక్కడ నుంచి తిరిగి సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. అనంతరం ఆయన ఒడిశాకు వెళ్తారు. భువనేశ్వర్‌లో రాత్రి 8.30 గంటలకు రోడ్‌షో నిర్వహించనున్నారు. 
 
మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుని హోటల్‌ తాజ్‌కృష్ణలో విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం భువనగిరిలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడనుంచి బయల్దేరి ఏపీలోని విజయవాడలో 6.45 గంటలకు నిర్వహించే బహిరంగ సభకు హాజరువుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

Mickey J. Meyer : నేను రెడీ కోసం మిక్కీ జె మేయర్ మ్యూజిక్

Sreeleela: బాలీవుడ్‌లో శ్రీలీలకు భారీ డిమాండ్.. అరుంధతిగా కనిపించబోతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments