Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డలకు భారంగా వుండకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య.. ఎలాగంటే?

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (21:14 IST)
Elderly Couple
కన్నబిడ్డలకు భారంగా వుండకూడదనుకున్న ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
మృతుడు కె రామచంద్రయ్య (75), అతని భార్య సరోజనమ్మ (69)లకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారు వారి ఆస్తులను వారి పిల్లలకు పంచిపెట్టారు. కుమారులు అదే మండలం గొల్లకొత్తూరు గ్రామంలో నివసిస్తున్నారు. డయాబెటిక్‌తో బాధపడుతున్న సరోజనమ్మ ఆయన భర్త  కొన్ని రోజులుగా తమ కుమారుల ఇంట వుంటూ వచ్చారు. 
 
కొద్ది రోజుల క్రితం రామచంద్రయ్య గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఉన్న తమ ఇంటికి భార్యను తీసుకొచ్చాడు. తమ కుమారులకు భారం కాకూడదనే ఉద్దేశంతో తమ జీవితాలను అంతం చేసుకుంటామని చెప్పాడు. ఇందుకు భార్య కూడా సమ్మతించింది. 
 
ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దంపతులు తిరిగి రాలేదు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు వెతకగా గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద వారి పాదరక్షలు, ఇతర వస్తువులు కనిపించాయి. 
 
బావిలో సరోజనమ్మ మృతదేహం లభ్యం కాగా, ఆదివారం రాత్రి వరకు రామచంద్రయ్య మృతదేహం ఈతగాళ్లకు లభించలేదు. అతని మృతదేహం కోసం సోమవారం కూడా వెతుకులాట కొనసాగించగా గ్రామ శివారులోని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రామచంద్రయ్యకు ఈత తెలిసి ఉండటంతో బావిలో దూకి ఉరివేసుకుని చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య ను మర్యాద పూర్వకంగా కలిసిన రామ్ చరణ్

సినిమా నచ్చకపోతే చెప్పుతో కొట్టుకుంటా అని అన్నాను... అందుకే ఆ పని చేశా... (Video)

ఘాటి షూట్ లో కారు బురదలో ఇరుక్కుపోయింది : జగపతిబాబు

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments