Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డలకు భారంగా వుండకూడదని వృద్ధ దంపతుల ఆత్మహత్య.. ఎలాగంటే?

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (21:14 IST)
Elderly Couple
కన్నబిడ్డలకు భారంగా వుండకూడదనుకున్న ఆ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
మృతుడు కె రామచంద్రయ్య (75), అతని భార్య సరోజనమ్మ (69)లకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారు వారి ఆస్తులను వారి పిల్లలకు పంచిపెట్టారు. కుమారులు అదే మండలం గొల్లకొత్తూరు గ్రామంలో నివసిస్తున్నారు. డయాబెటిక్‌తో బాధపడుతున్న సరోజనమ్మ ఆయన భర్త  కొన్ని రోజులుగా తమ కుమారుల ఇంట వుంటూ వచ్చారు. 
 
కొద్ది రోజుల క్రితం రామచంద్రయ్య గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఉన్న తమ ఇంటికి భార్యను తీసుకొచ్చాడు. తమ కుమారులకు భారం కాకూడదనే ఉద్దేశంతో తమ జీవితాలను అంతం చేసుకుంటామని చెప్పాడు. ఇందుకు భార్య కూడా సమ్మతించింది. 
 
ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన దంపతులు తిరిగి రాలేదు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు వెతకగా గ్రామంలోని వ్యవసాయ బావి వద్ద వారి పాదరక్షలు, ఇతర వస్తువులు కనిపించాయి. 
 
బావిలో సరోజనమ్మ మృతదేహం లభ్యం కాగా, ఆదివారం రాత్రి వరకు రామచంద్రయ్య మృతదేహం ఈతగాళ్లకు లభించలేదు. అతని మృతదేహం కోసం సోమవారం కూడా వెతుకులాట కొనసాగించగా గ్రామ శివారులోని చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. రామచంద్రయ్యకు ఈత తెలిసి ఉండటంతో బావిలో దూకి ఉరివేసుకుని చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments