Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

ఐవీఆర్
గురువారం, 17 జులై 2025 (18:43 IST)
హైదరాబాద్: కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐలో గణిత నమూనాపై అంతర్జాతీయసదస్సు(Math-CIGAI 2025)ను నేడు కెఎల్‌హెచ్ బాచుపల్లి ప్రారంభించింది. జూలై 17-18, తేదీలలో జరిగే ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు, కృత్రిమ మేధస్సు, మెరుగైన వ్యూహాలు, ఆరోగ్య సంరక్షణలో జనరేటివ్ ఏఐ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న అప్లికేషన్లలో అత్యాధునిక పరిశోధనను నడిపించే ప్రధాన కార్యక్రమంగా నిలుస్తుంది.
 
బౌరాంపేట క్యాంపస్‌లో నిర్వహించబడుతోన్న ఈ కార్యక్రమం, గణిత నమూనా, యంత్ర మేధస్సు, అభివృద్ధి చెందుతున్న ఏఐ సాంకేతికతల గురించి విస్తృత స్థాయి చర్చలలో పాల్గొనేందుకు అంతర్జాతీయ మరియు జాతీయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, విశిష్ట నిపుణులను ఒకేదరికి  తీసుకువచ్చింది. ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో జనరేటివ్ ఏఐ కీలక పాత్ర పోషిస్తుండటంతో, మెడికల్ ఇమేజ్ జనరేషన్, వ్యాధి నిర్ధారణలు, డేటా మెరుగుదల, గోప్యతను కాపాడే ఏఐ వ్యవస్థలలో దాని వినియోగాలను ఈ సదస్సు ప్రముఖంగా వెల్లడిస్తుంది. ఈ సదస్సులో పాల్గొనేవారు కీలక సెషన్‌లు, పరిశోధనా పత్ర ప్రజెంటేషన్‌లు, నిపుణుల చర్చాకార్యక్రమాలు, గ్లోబల్ నెట్‌వర్కింగ్ అవకాశాల కోసం ఎదురు చూడవచ్చు.
 
ఈ సమావేశంలో ప్రొఫెసర్ దీప్తి ప్రసాద్ ముఖర్జీ(ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కతా), ప్రొఫెసర్ యంగ్-చియోల్ బ్యూన్(జెజు నేషనల్ యూనివర్శిటీ, దక్షిణ కొరియా) వంటి ప్రఖ్యాత మేధావులు, ఇటలీ, టర్కీ, యుఎస్ఏ, దక్షిణ కొరియా, స్వీడన్, చైనా, ఆస్ట్రేలియా, నేపాల్ వంటి దేశాల నుండి వక్తలు, సలహాదారులు పాల్గొంటున్నారు, ఇది కెఎల్‌హెచ్ యొక్క పెరుగుతున్న అంతర్జాతీయ విద్యా కార్యకలాపాలను ప్రతిబింబిస్తుంది.
 
ఈ సందర్భంగా కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు లక్ష్మణ్ హవిష్ మాట్లాడుతూ, “సాంకేతికత, సమాజం మధ్య కీలకమైన సంభాషణను మ్యాథ్-సిగై 2025 ప్రారంభిస్తుంది. ఈ వేదిక ఇంటర్ డిసిప్లినరీ సహకారాన్ని వేడుక జరుపుకుంటుంది, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పరిశోధకులు, నిపుణులను పెంపొందించడం పట్ల మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది” అని అన్నారు. కెఎల్‌హెచ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్. కోటేశ్వరరావు మార్గదర్శకత్వంలో, కన్వీనర్లు, విశ్వవిద్యాలయం యొక్క విద్యా మరియు పరిపాలనా బృందాల మద్దతుతో ఈ సదస్సు నిర్వహించబడుతోంది.
 
ఈ హెల్త్ కేర్ (eHealthCare), డేటా సైన్స్, డెసిషన్-మేకింగ్ సిస్టమ్స్‌పై దృష్టి సారించిన దాని కేంద్ర ఇతివృత్తంతో, మ్యాథ్-సిగై 2025 హాజరైన వారందరికీ పరివర్తన పూర్వక అనుభవానికి హామీ ఇస్తుంది - రేపటి ఆవిష్కరణలను రూపొందించే ప్రభావవంతమైన చర్చలకు ఈరోజు వేదికను ఏర్పాటు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments