Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ మోదీ నుంచి సుపారీ తీసుకున్నారు.. రేవంత్ రెడ్డి ఫైర్

సెల్వి
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (17:44 IST)
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన కుమార్తె కె కవిత అరెస్ట్ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు. సాధారణంగా రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాల్లో ఇలాంటి అరెస్టులు జరిగినప్పుడు పార్టీలోని కీలక సభ్యులు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 
 
కానీ కేటీఆర్ స్పందిస్తూనే వున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్‌డిఎ ప్రభుత్వం కేంద్ర అధికారులను దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. కానీ కేసీఆర్ ఆశించిన స్థాయిలో ఫైర్ కాలేదు.
 
అయితే ఈ వ్యవహారంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. బీజేపీ గెలుపు కోసం కేసీఆర్ మోదీ నుంచి సుపారీ తీసుకున్నారని, అనేక పార్లమెంటరీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ కార్యకర్తలను రాజీ చేశారని ఆరోపించారు. 
 
కేసీఆర్‌ మోదీకి అమ్ముడుపోయారని, తన కూతురు కవితకు బెయిల్‌ ఇచ్చేలా బీఆర్‌ఎస్‌ క్యాడర్‌తో రాజీ పడ్డారని అన్నారు. 
 
జైలులో ఉన్న తన కూతురు కవితను బయటకు తీసుకురావడం కోసం కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను బలితీసుకున్న తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం బీఆర్‌ఎస్, బీజేపీ చేతులు కలిపి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ మౌనంగా పనిచేస్తోందని సీఎం పేర్కొన్నారు. 
 

సంబంధిత వార్తలు

ఎం.ఎల్.ఎ.లను కిడ్నాప్ చేసిన రామ్ చరణ్ - తాజా అప్ డేట్

దేవర లో 19 న ఎర్రసముద్రం ఎగిసెగిసిపడుద్ది : రామ జోగయ్యశాస్త్రి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments