Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదు.. బీజేపీలో చేరడం లేదు : ఎర్రబెల్లి దయాకర్

ఠాగూర్
మంగళవారం, 19 మార్చి 2024 (15:50 IST)
తాను పార్టీ మారనున్నట్టు సాగుతున్న ప్రచారంపై భారత రాష్ట్ర సమితి నేత ఎర్రబల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఎస్.ఐ.బి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్‌ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు ఆయన ఎవరో తనకు తెలియదన్నారు. 
 
ట్యాపింగ్ అంశంలో తన పేరు చెప్పాలని ప్రణీత్ రావుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. మోసాలు చేయడం, మాయ మాటలు చెప్పడం రేవంత్‌ రెడ్డికి అలవాటేనని అన్నారు. 
 
అలాగే, తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదన్నారు. తమ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం ఒక సైనికుడిలా పని చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గాల బీఆర్ఎస్‌ కేడర్‌ను బలహీన పరిచేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
కార్యకర్తలను తప్పుదారి పట్టించేందుకే ఈ తరహా ప్రచారం సాగుతుందన్నారు. తాను బీజేపీలో చేరబోతున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు. కావాలనే తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వయసుతో సమంబంధం లేదు - ప్రతి ఒక్కరూ బానిసలవుతున్నారు : ఐశ్వర్య రాయ్

Faria Abdullah: సరికొత్త డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ గుర్రం పాపిరెడ్డి సాంగ్

'గ్రాజియా ఇండియా' కవర్ పేజీపై సమంత!

Anupama: ప్రతి ఒక్కరి పరదా వెనుక మరో వ్యక్తి వుంటాడు : నిర్మాత విజయ్ డొంకడ

బావ బాగానే సంపాదించారు.. కానీ, మమ్మల్ని కొందరు మోసం చేశారు... డిస్కోశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments