Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోన్ ట్యాపింగ్‌తో తనకు సంబంధం లేదు.. బీజేపీలో చేరడం లేదు : ఎర్రబెల్లి దయాకర్

ఠాగూర్
మంగళవారం, 19 మార్చి 2024 (15:50 IST)
తాను పార్టీ మారనున్నట్టు సాగుతున్న ప్రచారంపై భారత రాష్ట్ర సమితి నేత ఎర్రబల్లి దయాకర్ రావు క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. అలాగే, ఎస్.ఐ.బి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు చేపట్టిన ఫోన్ ట్యాపింగ్‌ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసలు ఆయన ఎవరో తనకు తెలియదన్నారు. 
 
ట్యాపింగ్ అంశంలో తన పేరు చెప్పాలని ప్రణీత్ రావుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన పూర్తిగా విఫలమైందన్నారు. ఆరు గ్యారెంటీలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. మోసాలు చేయడం, మాయ మాటలు చెప్పడం రేవంత్‌ రెడ్డికి అలవాటేనని అన్నారు. 
 
అలాగే, తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదన్నారు. తమ అధినేత కేసీఆర్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కోసం ఒక సైనికుడిలా పని చేస్తానని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, పాలకుర్తి నియోజకవర్గాల బీఆర్ఎస్‌ కేడర్‌ను బలహీన పరిచేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
 
కార్యకర్తలను తప్పుదారి పట్టించేందుకే ఈ తరహా ప్రచారం సాగుతుందన్నారు. తాను బీజేపీలో చేరబోతున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు. కావాలనే తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments