YS Abhishek Reddy: జగన్ బంధువు వైఎస్ అభిషేక్ రెడ్డి కన్నుమూత

సెల్వి
బుధవారం, 8 జనవరి 2025 (12:12 IST)
Abhishek Reddy
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంధువు, సన్నిహితుడు వైఎస్ అభిషేక్ రెడ్డి హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో కొద్దిసేపటికే తుది శ్వాస విడిచారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ రెడ్డి మృతి చెందారు. ఆయన బ్రెయిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. అభిషేక్‌రెడ్డి మరణంతో వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

బుధవారం పులివెందులలో అభిషేక్ రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం. ఈ అంత్యక్రియలకు జగన్‌తో సహా వైఎస్ కుటుంబ సభ్యులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

వృత్తిరీత్యా వైద్యుడు, అభిషేక్‌ జగన్‌కు అత్యంత సన్నిహితుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ)కి లింగాల మండల ఇన్‌చార్జిగా పనిచేశారు. డప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్​ రెడ్డి అన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడే వైఎస్​ అభిషేక్‌రెడ్డి.

గత ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. లింగాల మండలానికి అభిషేక్ రెడ్డి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహారించారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అభిషేక్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్

ఆహ్వానించేందుకు వచ్చినపుడు షూటింగ్‌లో డ్యాన్స్ చేస్తున్నా : చిరంజీవి

పవన్ కల్యాణ్‌కు మొండి, పట్టుదల ఎక్కువ.. ఎక్కడా తలొగ్గడు.. జయసుధ (video)

శాంతారామ్ బయోపిక్‌లో తమన్నా.. పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్.. లుక్ అదుర్స్

శర్వా... నారి నారి నడుమ మురారి రిలీజ్-ముహూర్తం ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments