మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

ఠాగూర్
ఆదివారం, 23 నవంబరు 2025 (12:38 IST)
మెట్రో రైల్ రావడం ఆలస్యమైతే ప్రయాణికులపై అదనపు చార్జీలను బాదుతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఓ ప్రయాణికుడు 12 నిమిషాలు ఆలస్యంగా స్టేషన్‌ దాటినందుకు రూ.15 అదనపు చార్జీని వసూలు చేశారు. మెట్రో రైల్ ఆలస్యంగా రావడంతో ఈ జాప్యం జరిగిందని, దీనికి బాధ్యులు ఎవరూ అంటూ ఆ ప్రయాణికుడు వాపోతున్నాడు. 
 
ఇదే అంశంపై వరుణ్ అనే ప్రయాణికుడు స్పందిస్తూ, 'గత నెల 29న రాయదుర్గంలో సాయంత్రం మెట్రో రైలు ఎక్కా. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ ఇంటర్చేంజ్ స్టేషనులో దిగా. అక్కడి నుంచి కాసేపు నడిచి జేబీఎస్ స్టేషన్‌కు చేరుకుని మెట్రో ఎక్కి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో దిగాను. ప్రయాణం 1.30 గంటల సమయం దాటిందని అదనంగా రూ.15 ఛార్జీ చేశారు' అని ప్రయాణికుడు చేశారు. ఆ మార్గంలో ఆలస్యంగా 12 నిమిషాలకు ఒక మెట్రో ఉంటే.. దానికి ప్రయాణికులు బాధ్యులెలా అవుతారని ప్రశ్నిస్తున్నారు.
 
మెట్రో స్టేషనులోకి ప్రవేశించి రెండు గంటల తర్వాత బయటకు వస్తే అదనపు ఛార్జీ వడ్డిస్తున్నారని, అలాంటప్పుడు మెట్రో స్టేషనులో ఆహారశాలలు, ఇతర దుకాణాలు ఎందుకు ఏర్పాటు చేశారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. టికెట్ తీసుకున్న తర్వాత అరగంట లోపే స్టేషనులోకి ప్రవేశించాలి. రెండు గంటల్లోపే బయటికి రావాలి. అవగాహన లేక అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments