Webdunia - Bharat's app for daily news and videos

Install App

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో 62 కిలోల ఎండు గంజాయి స్వాధీనం..

సెల్వి
మంగళవారం, 28 మే 2024 (11:21 IST)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తిని రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి రూ.15.5 లక్షల విలువైన 62 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన చాంద్ కుమార్ నాయక్ (30)గా గుర్తించారు. అతడిని అరెస్టు చేయగా, మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
 
నాయక్ ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సోమవారం ఉదయం ప్లాట్‌ఫారమ్‌లు, రైళ్లలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న వారిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 10వ నంబర్ ప్లాట్‌ఫాంపై ఒడిశాలోని మోహనా నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు గంజాయి తరలిస్తుండగా నాయక్‌ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. నిషిద్ధ వస్తువులు ఉన్న రెండు ట్రాలీ సూట్‌కేసులు, మూడు షోల్డర్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన చిదాతో పాటు మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. రైల్వే పోలీస్ సూపరింటెండెంట్ షేక్ సలీమా మరియు ఆమె డిప్యూటీ ఎస్ఎన్ జావేద్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డెడ్‌పూల్ & వుల్వరైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్

రొమాన్స్ సాంగ్ తో డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తి

నందమూరి కల్యాణ్‌రామ్‌ బింబిసార2. ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌

కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌ ప్రణయగోదారి లోని సాయికుమార్ లుక్‌

ఆసక్తి రేపుతున్న పౌరుషం - ది మ్యాన్ హుడ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments