Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం మెషీన్లలోని రూ.42లక్షలు స్వాహా.. హర్యానా ముఠా కోసం వేట

సెల్వి
సోమవారం, 23 సెప్టెంబరు 2024 (10:14 IST)
హర్యానాకు చెందిన దొంగల ముఠా ఏటీఎం మెషీన్లలోని భారీ మొత్తాన్ని కొట్టేసింది. కడప ఒంటిమిట్టలోని రెండు ఏటీఎంల నుంచి రూ.42 లక్షలు, కడప ప్రధాన కార్యాలయంలోని మరో ఏటీఎంపై కూడా ఆదివారం తెల్లవారుజామున దాడి చేసేందుకు ప్రయత్నించారు. 
 
దక్షిణాది రాష్ట్రాల్లోని ఎన్‌హెచ్ రోడ్ల వెంబడి ఉన్న ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడంలో పేరుగాంచిన ఈ ముఠా చెక్‌పోస్టులను తప్పించుకోవడానికి కట్టర్‌లను ఉపయోగించి లారీలలో తప్పించుకునే స్కెచ్ వేస్తోంది.
 
ఈ క్రమంలో ఆదివారం ఒక్కరోజే మూడు ఏటీఎం కేంద్రాలపై దాడులు చేశారు. ఒంటిమిట్ట ఏటీఎంలో తొలిసారిగా చోరీకి పాల్పడి కట్టర్లను ఉపయోగించి రూ. 36 లక్షలు తీసుకుని కడపలోని ద్వారకా నగర్ ఏటీఎంకు వెళ్లారు.. అక్కడ రూ.6 లక్షలు కొల్లగొట్టారు. 
 
ఆపై కడపలోని విశ్వేశ్వరయ్య సర్కిల్‌లోని ఏటీఎంలోనూ దోపిడీకి యత్నించారు. ఈ ఘటనలపై స్పందించిన కడప పోలీసులు జిల్లాలో వరుస చోరీలపై నిఘా పెంచారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. 
 
ఈ దొంగల ముఠాను గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గత నెలలో ఇదే తరహాలో ఏటీఎం చోరీలకు పాల్పడిన ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments