Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు అలెర్ట్ : ఆ నాలుగు రైళ్ళు సికింద్రాబాద్ నుంచి బయలుదేరవు...

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (11:10 IST)
ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ హెచ్చరిక చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతూ వచ్చిన నాలుగు రైళ్లను ఇక నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరేలా మార్చారు. సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ.720 కోట్ల వ్యయంతో ఆధునకీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ పనులతో పాటు ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. 
 
ఆ ప్రకారంగా ఇక నుంచి తిరుపతి - ఆదిలాబాద్ ప్రాంతాల మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26వ తేదీ నుంచి చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 8.10 గంటలకు చర్లపల్లి టెర్మినల్‌లో బయలుదేరి రాత్రి 9.14 గంటలకు బొల్లారం స్టేషన్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ నుంచి ఈ రైలు ఉదయం 4.29 గంటలకు బొల్లారంకు, ఉదయం 5.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. 
 
అలాగే, కాకినాడ - లింగంపల్లిల మధ్య నడిచే ప్రత్యేక రైలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఉదయం 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి ఉదయం 9.15 గంటలకు గమ్యస్థానమైన లింగంపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి రాత్రి 7.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. 
 
కాజిపేట నుంచి నడిచే హదాప్పర్ ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 8.20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు తెల్లవారుజామున 3 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments