ప్రయాణికులకు అలెర్ట్ : ఆ నాలుగు రైళ్ళు సికింద్రాబాద్ నుంచి బయలుదేరవు...

ఠాగూర్
బుధవారం, 12 మార్చి 2025 (11:10 IST)
ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ హెచ్చరిక చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతూ వచ్చిన నాలుగు రైళ్లను ఇక నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరేలా మార్చారు. సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ.720 కోట్ల వ్యయంతో ఆధునకీకరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో ఈ పనులతో పాటు ప్రయాణికులు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగా ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ తెలిపింది. 
 
ఆ ప్రకారంగా ఇక నుంచి తిరుపతి - ఆదిలాబాద్ ప్రాంతాల మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఈ నెల 26వ తేదీ నుంచి చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు రాత్రి 8.10 గంటలకు చర్లపల్లి టెర్మినల్‌లో బయలుదేరి రాత్రి 9.14 గంటలకు బొల్లారం స్టేషన్‌కు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఆదిలాబాద్ నుంచి ఈ రైలు ఉదయం 4.29 గంటలకు బొల్లారంకు, ఉదయం 5.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. 
 
అలాగే, కాకినాడ - లింగంపల్లిల మధ్య నడిచే ప్రత్యేక రైలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి జూలై ఒకటో తేదీ వరకు చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. ఉదయం 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి ఉదయం 9.15 గంటలకు గమ్యస్థానమైన లింగంపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 6.30 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి రాత్రి 7.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. 
 
కాజిపేట నుంచి నడిచే హదాప్పర్ ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 8.20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు తెల్లవారుజామున 3 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన ఓ పత్రికా ప్రటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika Nair: శర్వా.. బైకర్ ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్ థియేటర్లలో స్క్రీనింగ్

Thaman: బాలకృష్ణ.. అఖండ 2: తాండవం బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం సర్వేపల్లి సిస్టర్స్

Dulquer : దుల్కర్ సల్మాన్.. కాంత నుంచి రాప్ ఆంథమ్ రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

Rashmika: ది గర్ల్ ఫ్రెండ్ లో రశ్మికను రియలిస్టిక్ గా చూపించా : రాహుల్ రవీంద్రన్

Bhumi Shetty: ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ తో రాబోతున్న మహాకాళి చిత్రంలో భూమి శెట్టి లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments