Webdunia - Bharat's app for daily news and videos

Install App

గత 20 ఏళ్లలో తొలిసారిగా తెలంగాణలో భూప్రకంపనలు.. ములుగు జిల్లాలో?

సెల్వి
బుధవారం, 4 డిశెంబరు 2024 (11:38 IST)
strongest earthquake
గత 20 ఏళ్లలో తొలిసారిగా తెలంగాణలో అత్యంత బలమైన భూకంపం సంభవించింది. ములుగు వద్ద 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. హైదరాబాద్‌తో సహా తెలంగాణ మొత్తం ప్రకంపనలు సృష్టించింది. గోదావరి నదీగర్భంలో మరోసారి భూకంపం వచ్చినప్పటికీ బలమైన భూప్రకంనలు వచ్చాయి. 
 
చరిత్రలో హైదరాబాద్, ఆ చుట్టుపక్కల భూకంపాలను లెక్కలోకి తీసుకుంటే, ములుగు జిల్లాలో వచ్చినదే పెద్ద భూకంపం అంటున్నారు నిపుణులు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. 
 
ఇదే విధంగా.. 1993, సెప్టెంబర్‌ 30న తెల్లవారుజామున 3.55 గంటలకు హైదరాబాద్‌‌కి దగ్గర్లో భారీ భూకంపం ఏర్పడింది. అది హైదరాబాద్‌కి తూర్పు-ఈశాన్య దిశలో 226 కిలోమీటర్ల దూరంలో వచ్చింది. గత 124 సంవత్సరాలలో హైదరాబాద్ సమీపంలో సంభవించిన అత్యంత బలమైన భూకంపం అదే. హైదరాబాద్‌కి దగ్గర్లో గత పదేళ్లలో వచ్చిన భూకంపాల్లో ఒకటి 2020 ఏప్రిల్‌ 24న ఆసిఫాబాద్‌లో వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.8గా నమోదైంది. 
 
ఇలా ఈ భూకంపాలన్నీ హైదరాబాద్ చుటుపక్కల వచ్చాయే తప్ప హైదరాబాద్‌లో రాలేదు. మరింతగా పర్యావరణ వినాశనం జరగకుండా చూసుకుంటే, ఇలాంటి తీవ్ర పరిస్థితులు రావు అని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments