Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలపిట్టను పంజరంలో చెరబట్టిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి, వన్యప్రాణి సంరక్షకులకు ఫిర్యాదు

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (22:38 IST)
దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తే పుణ్యం వస్తుందని, శుభం జరుగుతుందని విశ్వాసం. ఐతే పూర్వం పల్లెల్లు, పట్టణాలు అన్నీ వృక్షాలు, చెట్లతో నిండి వుండటం వల్ల పాలపిట్టలు అడపాదడపా దర్శనమిచ్చేవి. పండుగనాడు వాటిని చూసి తృప్తిపడేవారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఎక్కడో సుదూర ప్రాంత అడవుల్లో ఇవి వుంటున్నాయి. దీనితో దసరా పండుగ నాడు పాలపిట్టలను చూడాలన్న ఆత్రుతలో కొంతమంది వాటిని పట్టుకుని తెస్తున్నారు. 
 
ఇదే పని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి కూడా చేసేసారు. దసరా పండుగ నాడు ఆయన పాలపిట్టను పంజరంలో బంధించి తెచ్చారు. వేడుకల్లో భాగంగా ఆ పంజరాన్ని అక్కడికి తీసుకుని వచ్చి అందులో వున్న పాలపిట్టను పట్టుకుని బైటకు తీసి ప్రజలకు బహిరంగంగా చూపిస్తూ అంతా చూడండి శుభం కలుగుతుందని చెప్పారు. ఐతే ఇలా చేసి ఆయన వివాదంలో చిక్కుకున్నారు.
 
వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం పక్షులను పంజరంలో బంధించడం నేరం. పండుగ రోజున పాలపిట్టను వేధించారంటూ తెలంగాణ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ సుభద్రాదేవికి వన్యప్రాణ సంరక్షకులు ఫిర్యాదు చేసారు. మరి ఈ చట్టం ప్రకారం కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంటారేమోనని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments