Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాలపిట్టను పంజరంలో చెరబట్టిన కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి, వన్యప్రాణి సంరక్షకులకు ఫిర్యాదు

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (22:38 IST)
దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తే పుణ్యం వస్తుందని, శుభం జరుగుతుందని విశ్వాసం. ఐతే పూర్వం పల్లెల్లు, పట్టణాలు అన్నీ వృక్షాలు, చెట్లతో నిండి వుండటం వల్ల పాలపిట్టలు అడపాదడపా దర్శనమిచ్చేవి. పండుగనాడు వాటిని చూసి తృప్తిపడేవారు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. ఎక్కడో సుదూర ప్రాంత అడవుల్లో ఇవి వుంటున్నాయి. దీనితో దసరా పండుగ నాడు పాలపిట్టలను చూడాలన్న ఆత్రుతలో కొంతమంది వాటిని పట్టుకుని తెస్తున్నారు. 
 
ఇదే పని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి కూడా చేసేసారు. దసరా పండుగ నాడు ఆయన పాలపిట్టను పంజరంలో బంధించి తెచ్చారు. వేడుకల్లో భాగంగా ఆ పంజరాన్ని అక్కడికి తీసుకుని వచ్చి అందులో వున్న పాలపిట్టను పట్టుకుని బైటకు తీసి ప్రజలకు బహిరంగంగా చూపిస్తూ అంతా చూడండి శుభం కలుగుతుందని చెప్పారు. ఐతే ఇలా చేసి ఆయన వివాదంలో చిక్కుకున్నారు.
 
వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం పక్షులను పంజరంలో బంధించడం నేరం. పండుగ రోజున పాలపిట్టను వేధించారంటూ తెలంగాణ వైల్డ్ లైఫ్ చీఫ్ వార్డెన్ సుభద్రాదేవికి వన్యప్రాణ సంరక్షకులు ఫిర్యాదు చేసారు. మరి ఈ చట్టం ప్రకారం కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డిపై చర్యలు తీసుకుంటారేమోనని చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓజీ షూటింగ్‌కు హాజరుకానున్న పవన్ కళ్యాణ్?

ఫీమేల్ ఓరియెంటెడ్‌గా ప్రియాంక ఉపేంద్ర ఉగ్రావతారం సినిమా

వరుణ్ తేజ్ మట్కా పవర్ ప్యాక్డ్ రిలీజ్ న్యూ పోస్టర్

సిద్దిఖీ హత్యతో సల్మాన్‌ ఖాన్‌కూ చావు భయం‌ పట్టుకుందా?

శ్రీమురళి, ప్రశాంత్ నీల్ కాంబోలో బగీరా నుంచి రుధిర హారా సింగిల్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ రాత్రిపూట ఒక్క యాలుక్కాయ తింటే?

హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డ యూకెలో అలాయి బలాయి

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

మధుమేహం-సంబంధిత దృష్టి నష్టాన్ని నివారించే లక్ష్యంతో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్

తర్వాతి కథనం
Show comments