రేవంత్ రెడ్డి భాష సీఎం హోదాకు సరిపోతుందా?: కేసీఆర్ ప్రశ్న

సెల్వి
మంగళవారం, 12 మార్చి 2024 (22:00 IST)
తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కరెంటు, నీటి కష్టాలతో సతమతమవుతున్న రైతుల కష్టాలను నిర్లక్ష్యం చేస్తోందని, పంటలను తగలబెట్టడం బాధాకరమైన చర్య అంటూ తెలిపారు. 
 
రైతులను పట్టించుకోకుండా.. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా.. కాంగ్రెస్ సీఎంతో పాటు ఆయన మంత్రులు బీఆర్ఎస్ పాలనను నిందించడాన్ని పనిగా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారు. 
 
కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన 'కదన భేరి' బహిరంగ సభలో  చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హామీలను నెరవేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
 
 
"తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, మా సమస్యలను ఎత్తిచూపడానికి నేను ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ పాలకులపై కొన్ని బలమైన పదజాలాన్ని ఉపయోగించాను. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత నా రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడూ దుర్భాషలాడలేదు. 
 
కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి తన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టకుండా, గత పాలనపై నిందలు వేయడంలో, మాటల దాడులతో బిజీగా ఉన్నారు" అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి భాష ముఖ్యమంత్రి హోదాకు సరిపోతుందా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments