Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ యువతి ప్రాణాలు తీసిన ఇద్దరు వ్యక్తుల గొడవ...

ఠాగూర్
శుక్రవారం, 5 జనవరి 2024 (11:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఓ యువతి ప్రాణాలు తీసింది. దీంతో పెళ్లింటి విషాదం నెలకొంది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని చేగుంట మండలం, రెడ్డిపల్లి కాలనీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, రెడ్డిపల్లి వడ్డెర కాలనీకి చెందిన ఉప్పు వెంకటి అనే వ్యక్తి కుమార్తె సువర్ణ వివాహం గురువారం జరిగింది. పెళ్లి కుమార్తెను ఊరేగింపుగా తీసుకెళ్లి కామారెడ్డి జిల్లా బికనూు మండలం లక్ష్మీదేవిపల్లిలోని మెట్టినింటికి పంపించారు. అయితే, తిరిగి ఇంటికి వస్తుండగా అదే కాలనీకి చెందిన ఉప్పు నరేందర్, స్వామి మధ్య గొడవ జరిగింది. 
 
ఈ ఘర్షణలో స్వామిని నరేందర్ నెట్టేశాడు. దీంతో కిందపడిన స్వామిని అక్కడున్న వారు పక్కకు తీసుకెళ్లారు. దీంతో ఆగ్రహానికి గురైన నరేందర్ తన థార్ కారును తీసుకొచ్చి అక్కడ ఉన్న పెళ్లి బందంపై ఎక్కించారు. ఈ ఘటనలో రమ్య (23) అనే యువతి తీవ్రంగా గాయపడటంతో, ఆమెను హైదరాబాద్ తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది. ఇక ఉప్పు దుర్గయ్య, సుజాత, యాదగిరి, సురేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నరేందర్ కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప 2 కు అన్నీ అడ్డంకులే.. ముఖ్యంగా ఆ ఇద్దరే కారణమా?

ముంబైలో చెర్రీ ఇంట్లోనే వుండిపోయా.. ఎవరికీ చెప్పొద్దన్నాడు.. మంచు లక్ష్మి

రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ చిత్రం హంపిలో ప్రారంభం

భార్య విడాకులు.. సౌదీ యూట్యూబర్‌తో నటి సునైనా నిశ్చితార్థం..

సరిగ్గా 10 యేళ్ల క్రితం మేం ముగ్గురం... 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్ ట్వీట్ వైరల్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments