Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిలో చికెన్ రూ.300... కిలో చింత చిగురు రూ.500...

వరుణ్
మంగళవారం, 23 ఏప్రియల్ 2024 (13:33 IST)
తెలంగాణ రాష్ట్రంలో చింత చిగురు ధర చికెన్ ధరను మించిపోయింది. కిలో చికెన్ ధర రూ.300 పలుకుతుంటే.. చింత చిగురు ధర మాత్రం ఏకంగా రూ.500 దాటిపోయింది. దీంతో గృహిణులు వామ్మో అంటో నోరెళ్లబెడుతున్నారు. దీనికి కారణం చింత చిగురు దిగుబడి గణనీయంగా తగ్గిపోవడమే. 
 
నిజానికి వేసవి కాలంలో వచ్చే చింత చిగురుకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. యేడాదికి ఒకసారి మాత్రమే లభ్యమయ్యే ఈ చింతచిగురు తినేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అందుకే ధరను సైతం లెక్క చేయకుండా దీన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈ సారి మాత్రం చింత చిగురు ధర ఆకాశానికి తాకింది. చికెన్ ధరను మించి పలుకుతుంది. దీంతో దీనిని కొనుగోలుకు జనం ఒకటికి పదిసార్లు ఆలోచన చేస్తున్నారు. 
 
సాధారణంగా చింతచిగురు కిలో రూ. 200 వరకు పలుకుతుంది. అయితే, ఈసారి రూ. 500కుపైగానే పలుకుతూ గుండెలు గుభేల్‌మనిపిస్తోంది. అదేసమయంలో చికెన్ కిలో రూ. 300 లోపే పలుకుతోంది. గ్రామాల్లో విరివిగా లభించే చింతచిగురుకు ఈసారి హైదరాబాద్‌లో కొరత ఏర్పడింది. రైతుబజార్‌తోపాటు మార్కెట్లలోనూ వీటి ధర బెంబేలెత్తిస్తోంది. దీంతో వినియోగదారులు 50, 100 గ్రాములకే పరిమితమవుతున్నారు. రైతు బజార్లలో 100 గ్రాముల చింతచిగురు రూ. 50కి లభిస్తుండగా బయట మార్కెట్లలో రూ.70 నుంచి 80 మధ్యలో విక్రయిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments