Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారాస నుంచి ఫస్ట్ వికెట్ డౌన్ : కాంగ్రెస్ గూటికి పెద్దపల్లి ఎంపీ

ఠాగూర్
మంగళవారం, 6 ఫిబ్రవరి 2024 (11:34 IST)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామంటూ హెచ్చరికలు చేస్తున్న భారత రాష్ట్ర సమితి (భారాస)కు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు తేరుకోలేని షాకిచ్చారు. భారాసకు చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతను తమవైపునుకు తిప్పుకున్నారు. దీంతో భారాస తొలి వికెట్ పడిపోయింది. బీఆర్ఎస్‌‍కు చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరడం వెంకటేశ్ నేతాతో ప్రారంభమైంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. సీఎంతో కలిసి వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన ఆయన.. వివిధ అంశాలపై చ్చించారు. మరోవైపు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 
 
ఇదిలావుంటే ఇటీవల ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో వారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. అయితే, నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తమే సీఎం రేవంత్‌ను కలిసినట్టు ఆ తర్వాత వారు వివరణ ఇచ్చారు. అయితే, అనేక బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ గూటికి వచ్చేందు సిద్ధమైపోయినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. పైగా గత ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అనేక మంది పూర్వ కాంగ్రెస్ నేతలు కావడం గమనార్హం. దీంతో వీరంతా తిరిగి సొంత గూటికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ ప్రకటనలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు ఈ పరిణామం ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments