Webdunia - Bharat's app for daily news and videos

Install App

బండి సంజయ్‌కు కీలక పదవి.. బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా నియామకం

Webdunia
గురువారం, 4 జనవరి 2024 (09:38 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కీలక నేత, ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. రెండు మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బండి సంజయ్‌ను బీజేపీ కిసాన్ మోర్చా ఇన్‌చార్జ్‌గా నియమించడం గమనార్హం. అలాగే, మరికొందరు సీనియర్ నేతలకు కూడా కీలక బాధ్యతలను అప్పగించింది. 
 
యువమోర్చా ఇన్‌చార్జిగా సునీల్ బన్సల్, కిసాన్ మోర్జా ఇన్‌చార్జిగా బండి సంజయ్ కుమార్‌లను పార్టీ అధిష్టానం నియమించింది. ఇక ఎస్సీ మోర్చా ఇన్‌చార్జిగా డాక్టర్ రాధా మోహన్ దాస్ అగర్వాల్, బీజేపీ మోర్చా ఇన్‌చార్జిగా వినోద్ తావ్డే, మైనారిటీ మోర్చా ఇన్‌చార్జిగా దష్యంత్ కుమార్ గౌతమ్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, జూలై 2023లో చివరిసారి బీజేపీ జాతీయ అఫీస్ బేరర్ల పునర్‌వ్యవస్థీకరణ జరిగింది. గత యేడాది డిసెంబరు నెలలో బీజేపీ పంజాబ్ రాష్ట్ర పార్టీ విభాగాల ఇన్‌చార్జులను మార్చింది. వివిధ విభాగాలకు 70 మందితో ఇన్‌చార్జులను, సహా ఇన్‌చార్జులను నియమించిన విషయం తెల్సిందే. ఈ యేడాది సార్వత్రిక ఎన్నికలు జరగాల్సివుండటంతో పార్టీలో అంతర్గత మార్పులు చేర్పులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments