Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఎఎస్ఐ

ఐవీఆర్
బుధవారం, 27 మార్చి 2024 (11:52 IST)
మహిళా ఫిర్యాదురాలితో అక్రమ సంబంధం పెట్టుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఎఎస్ఐను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసారు. వివరాల్లోకి వెళితే జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళా తన భర్త గత రెండు సంవత్సరాలుగా వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే పోలీస్ స్టేషన్లో ఎఎస్ఐ వి. రామయ్య కూడా విధులు నిర్వహిస్తుండంతో సదరు బాధిత మహిళతో పరిచయం ఏర్పడింది.
 
బాధితురాలికి తగు న్యాయం చేస్తానని ఆమెను నమ్మించి, సదరు మహిళ ఫోన్ నంబర్ తీసుకుని ఆమెతో సన్నిహింతగా వుంటూ అక్రమ సంబంధం కొనసాగించాడు. తాను బందోబస్తూ విధులు నిర్వహించే ప్రదేశానికి సదరు మహిళను పిలిపించుకొని ఆమెతో ఏకాంతంగా గడిపేవాడు.
 
ఎఎస్ఐ రాసలీలలు స్థానిక సామజిక మధ్యామాల్లో ప్రచారం జరగడంతో విచారణ జరుపగా ఎఎస్ఐ పిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. ఈ కారణంగా ఎఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ 1 ఐజీ ఎ. వి. రంగనాథ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments