Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల అధికారమే గొప్పది : మాజీ మంత్రి కేటీఆర్

వరుణ్
సోమవారం, 24 జూన్ 2024 (10:36 IST)
అధికారంలో ఉన్న వారి కంటే ప్రజల అధికారమే గొప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. భారత రాష్ట్ర  సమితికి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్ కుమార్ సొంత పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, 2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యే పెద్ద సంఖ్యలో ఆ పార్టీలో చేరారని గుర్తు చేశారు. ఆ తర్వాత ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాతీర్పునకు తలవంచాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. చరిత్ర పునరావృతమవుతుందని, అధికారంలో ఉన్నవారికంటే ప్రజల అధికారమే గొప్పదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణా రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా, ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు సైతం ఆ పార్టీటి టాటా చెప్పేస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం భారాసను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికతో మొత్తం ఐదుగురు భారాస ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టయింది. వీరిలో భారాసకు చెందిన కీలక నేతలు పోచారం శ్రీనివాస రెడ్డి, దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు ఉండగా, తాజాగా సత్యకుమార్ ఆ జాబితాలో చేరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూన్ లో చిరంజీవి షూటింగ్ ప్రారంభిస్తామన్న అనిల్ రావిపూడి

మిథున్ చక్రవర్తి లవ్ స్టొరీ బిగిన్స్ చిత్రం మొదలైంది

David Warner: రాబిన్ హుడ్‌ సినిమాలో డేవిడ్ వార్నర్... నితిన్, శ్రీలీల చిత్రాల్లో ఎలా కనిపిస్తారో?

రాణి భార‌తి ఈజ్ బ్యాక్‌! చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా.. (video)

స్పిరిట్ కోసం పలు జాగ్రతలు తీసుకుంటున్న సందీప్ రెడ్డి వంగా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments