Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఇన్‌చార్జ్ గవర్నరుగా సీపీ రాధాకృష్ణన్

ఠాగూర్
మంగళవారం, 19 మార్చి 2024 (12:00 IST)
తెలంగాణ రాష్ట్ర గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నరుగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. దీంతో తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ బాధ్యతలను జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు అదనంగా కేటాయించారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. 
 
మరోవైపు, గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత తమిళిసై హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ను వీడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను ప్రజాసేవ కోసం తిరిగి వెళుతున్నానని చెప్పారు. తనపై చూపిన ప్రేమాభిమానాలకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్టు చెప్పారు. పైగా తాను ఎప్పటికీ తెలంగాణ సోదరినేనని, తెలంగాణాను వీడి వెళుతున్నందుకు బాధగా ఉందని చెప్పారు. 
 
మరోవైపు, లోక్ సభ ఎన్నికలలో ఆమె బీజేపీ తరపున తమిళనాడులో బరిలోకి దిగనున్నారని తెలుస్తోంది. గవర్నర్ పదవి చేపట్టకముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. 2019 సెప్టెంబర్ నుంచి తెలంగాణ గవర్నర్‌గా ఉన్నారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె ఇపుడు ఈ రెండింటికి రాజీనామా చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments