Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒరేయ్ అల్లుళ్లూ, మీ మావయ్యతో వేగలేకపోతున్నా, అతణ్ణి చంపేయండి

ఐవీఆర్
శుక్రవారం, 8 మార్చి 2024 (19:01 IST)
కొందరు భర్తలు ప్రతి చిన్న విషయానికి భార్యలను వేధిస్తుంటారు. ఆ గొడవలు ఎలా వుంటాయంటే... నవ్వుతున్నావేంటి, ఇక్కడ ఎందుకు నిలబడ్డావు, వాళ్లను ఎందుకు చూస్తున్నావు, ఫలానా వ్యక్తి నిన్నే ఎందుకు చూస్తున్నాడు... వంటి వేధింపులు చాలానే వుంటాయి. ఐతే వీటిని కొందరు భరిస్తుంటారు కానీ మరికొందరు ఆ వేధింపులను తాళలేక క్రూరంగా మారిపోతుంటారు. అలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో జరిగింది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 45 ఏళ్ల మస్నాజీ నిత్యం తన భార్యను ఏదో వంకతో వేధిస్తుండేవాడు. చీటికిమాటికి గొడవపడుతూ దండిస్తుండేవాడు. ఈ బాధ భరించలేని బాధితురాలు తన ఇద్దరు మేనళ్లులకు మొరపెట్టుకున్నది. మావయ్య వేధింపులను భరించలేకపోతున్నాననీ, అతడి అడ్డు తొలగించండి అని చెప్పడంతో వారిరువురూ మరో వ్యక్తిని తోడు తీసుకుని మస్నాజీపై దాడి చేసారు. ఇనుప రాడ్లు, కర్రలతో బలంగా మోదడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments