Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రికి బైక్ గిఫ్టుగా ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన టెక్కీ

ఠాగూర్
ఆదివారం, 27 ఏప్రియల్ 2025 (15:09 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ సాఫ్ట్‌వేర్ మహిళా ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయారు. తన తండ్రికి బైకు గిఫ్టుగా ఇచ్చేందుకు స్వగ్రామానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలం, ఆకుపాముల వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, గచ్చిబౌలిలలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో యశస్విని అనే యువతి టెక్కీగా పనిచేస్తున్నారు. వెస్ట్ గోదావరి జిల్లా తుందుర్రు అనే గ్రామంలో ఉండే తన తండ్రికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకును గిఫ్టుగా ఇచ్చి సర్‌ ప్రైజ్ చేయాలని భావించింది. ఇందులో హైదరాబాద్ నగరంలోని ఆ బైకును కొనుగోలు చేసింది. తనతో పాటు పని చేస్తున్న ఉద్యోగితో కలిసి స్వగ్రామానికి బైకుపై బయలుదేరింది. 
 
అయితే, వీరి బైకు సూర్యాపేట జిల్లా మునగాల మండలం, ఆకుపాముల వద్ద వెళుతుండగా బైకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో యశస్విని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా తుందుర్రు గ్రామవాసిగా గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments